Monday, April 29, 2024

ఆరోగ్య సమాచార సేకరణ

- Advertisement -
- Advertisement -
Public Health Profile Project Launched Soon

 

రాష్ట్ర ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు త్వరలో ప్రారంభం
పైలట్ ప్రాజెక్టు అమలుకు ములుగు, సిరిసిల్ల జిల్లాల
ఎంపిక ఆరోగ్య సమాచార సేకరణతో వ్యాధుల ధోరణి
తెలుసుకోవడం, వాటి నివారణ తదితరాలు సులభతరం
పైలట్ ప్రాజెక్టు కింద ఇంటివద్దనే ఆరోగ్య సమాచారం
సేకరణ ప్రగతిభవన్ సమీక్షలో మంత్రులు కెటిఆర్,
ఎర్రబెల్లి, సత్యవతి నిర్ణయం టెక్నాలజీ సహకారంతో
సమస్యల పరిష్కారానికి, ఇతర సేవలందించడానికి
మా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది : కెటిఆర్

 

Public Health Profile Project Launched Soonమన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పై లెట్ ప్రాజెక్టు కింద ములుగు, సిరిసిల్ల జిల్లాలను ఎంపిక చేసింది. ఈ రెండు జిల్లాల్లో ప్రాజెక్టును సంపూర్ణంగా విజయవంతం చేసిన అనంతరం మిగిలిన అన్ని జిల్లాల్లో చేపట్టాలని తలపెట్టింది. రాష్ట్రంలో ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్‌ను చేపట్టాలని ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రాజెక్టు పురోగతిపైన మంత్రులు కె.తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌లు గురువారం ప్రగతి భవన్‌లో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ, ఐటి శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన ఈ సమావేశంలో హెల్త్ ప్రొ ఫెల్‌ను చేపట్టే అంశంపై మరోసారి సమగ్రంగా చర్చించా రు.

పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన రెండు జిల్లాల్లో ప్రజల ప్రాథమిక ఆరోగ్య సమాచారం ప్రభుత్వం వద్ద ఉం టే, వారికి అవసరమైన కార్యక్రమాలను చేపట్టడంలో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ప్రధానంగా వ్యాధుల ట్రెం డ్స్, వాటి నివారణ, ఇతర కార్యక్రమాల తయారీలో ఈ ప్రాజెక్టు సహకారం అందిస్తుందన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ వైద్య సహకారం అందించేందుకు ఈ ప్రాజెక్టు సమాచారం ఎంతగానో దోహద పడుతుందని వ్యాఖ్యానించా రు. గతంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ములు గు, సిరిసిల్ల జిల్లాల్లో ఒక పైలట్ ప్రాజెక్టు చేపట్టి రెండు జిల్లాల ప్రజల హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేయాలన్న ప్రభు త్వ ఆదేశాలను ఆచరణలోకి తీసుకువస్తామని మంత్రు లు తెలిపారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఐటి శాఖ ఆధ్వ ర్యంలో అనేక ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్, మొబైల్ ప్లాట్ ఫామ్‌పైన అందిస్తున్న విషయాన్ని ఐటి శాఖ మంత్రి కెటి ఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. టెక్నాలజీ సహకారంతో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు, అత్యం త సులభంగా ప్రభుత్వ సేవలను అందించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందువరుసలో ఉంటుందన్నా రు. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆరోగ్య సమాచారనికి సంబంధించిన కనీస సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటే ఆ శాఖ పరిధిలో చేపట్టేటువంటి భవిష్యత్తు ప్రణాళికలకు సరైన ప్రాతిపదిక అవుతుందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పౌరుల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు ద్వారా లభించే సమాచార విశ్లేషణ చేయడం వలన వివిధ జిల్లాల్లో ప్రత్యేకించి ఉన్న వ్యాధులు మరియు సీజనల్ వ్యాధుల హెల్త్ ట్రెండ్స్‌ను సైతం గుర్తించేందు కు అవకాశముంటుందని మంత్రి కెటిఆర్ అన్నారు. తద్వారా ఆయా ఆరోగ్య సమస్యలకు అవసరమైన నివా రణ మరియు చికిత్సకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుందన్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల లాంటి సమయా ల్లో అత్యవసర చికిత్స అందించేందుకు ప్రజల ప్రాథమిక సమాచారం సహాయ పడుతుందన్నారు. అయితే ఇంత భారీ ప్రాజెక్టు చేపట్టి ముందు రాష్ట్రంలో చిన్న జిల్లాలైన ములుగు, సిరిసిల్లలను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంచుకున్నమన్నారు.

ముందుగా ఈ రెండు జిల్లాల్లో ఉన్న వైద్య శాఖ సిబ్బంది సహకారంతో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక వివరాలను ప్రజల ఇంటివద్ద నే సేకరిస్తామన్నారు. ముఖ్యంగా బిపి షుగర్, యూరి న్ వంటి వివిధ రక్త పరీక్షల వివరాలను అక్కడికక్కడే క్షేత్రస్థాయిలో సేకరిస్తామని మంత్రి కెటిఆర్ వెల్లడించా రు. ఎవరికైనా అదనపు పరీక్షల అవసరం తలెత్తితే స్థాని కంగా అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లు, తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్ల ద్వారా ఆయా పరీక్షలను నిర్వహిస్తామన్నారు. ఇందుకు సంబంధించి ప్రాథమిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన సిబ్బందితో పాటు పరికరాలను అందిస్తామన్నారు.

ఇలాంటి హెల్త్ ప్రొఫైల్ రికార్డుని ఇప్పటికే పూర్తిచేసిన ఈస్టోనియా వంటి దేశాల నమూనాలను అధ్యయనం చేయాలని మంత్రి కెటిఆర్ సూచించారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం మారుమూల ప్రాంతమై న ములుగు జిల్లాను పెంచుకోవడం ద్వారా అక్కడి స్థానికులకు అనేక ఉపయోగాలు కలుగుతాయని వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌లు తెలిపారు. ముఖ్యంగా గిరిజ న జనాభా అధికంగా ఉండే ఈ జిల్లాలో ప్రజలకు అత్యవసరమైన ఆరోగ్య సేవలను అందించేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు ప్రాజెక్టు వివరాలను మంత్రులకు తెలియజేశారు. ఈ సందర్భంగా తాము చేపట్టబోయే పైలెట్ ప్రాజెక్టు పైన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. దీనికి సంబంధించి మంత్రులు ఇచ్చిన పలు సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని మరో వారం రోజుల్లో పూర్తి మార్గదర్శకాలతో ఒక నివేదిక అందిస్తామని అధికారులు మంత్రులకు తెలిపారు. ఈ సమీక్షలో వైద్యశాఖ ఉన్నతాధికారులైన సయ్య ద్ అలీ ముర్తుజా రిజ్వి, వాకటి కరుణ, శ్రీనివాస్ రావు, రమేష్, గంగాధర్, ఐటి శాఖ ఉన్నతాధికారులు జయే ష్ రంజన్, జి. వెంకటేశ్వరరావు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News