Wednesday, May 8, 2024

జాతి రత్నం పివి: వాణి దేవి

- Advertisement -
- Advertisement -

PV Narasimha rao death anniversary celebrations

హైదరాబాద్: జాతి రత్నంగా పివిని పిలుస్తున్నామని ఎమ్మెల్సీ వాణి దేవి తెలిపారు. పివి వర్ధంతి సందర్భంగా పివి జ్ఞాన భూమి వద్ద  ఆయన విగ్రహానికి వాణి దేవి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పివి శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా జరిపిందన్నారు. ఇంత పెద్ద విగ్రహం దేశంలో ఎక్కడ లేదని, తన విఘ్నతతో దేశంలో ఎన్నో సంస్కరణలు చేశారని కొనియాడారు. ఎన్నో ఉపన్యాసాలు, కవితలు పివి మీద వస్తున్నాయని ప్రశంసించారు. ప్రమాద అంచున ఉన్న భారత దేశాన్ని తన ఆలోచనతో ఆర్థికంగా గట్టెకించారన్నారు. పివి మార్గ్ లో గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు అన్నదానం ఏర్పాటు చేశామని పివి కుటుంబ సభ్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News