Thursday, May 9, 2024

ఉమెన్ పిసికి రాచకొండ సిపి సన్మానం

- Advertisement -
- Advertisement -

Rachakonda CP honored Women PC

 

మనతెలంగాణ, హైదరాబాద్ : అత్యవసరం ఉన్న మహిళకు రక్తం ఇచ్చిన ఉమెన్ కానిస్టేబుల్‌ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సన్మానం చేశారు. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో శుక్రవారం ఉమెన్ పిసి స్వప్నకు శాలువా కప్పి సన్మానం చేశారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో ఎక్మోపై అత్యవస చికిత్స పొందుతున్న మహిళకు బి పాజిటివ్ రక్తం కావాల్సి ఉంది. వెంటనే స్పందించిన ఉమెన్ కానిస్టేబుల్ వెళ్లి రక్త దానం చేసింది. విషయం తెలుసుకున్న రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పిసిని పిలిపించుకుని సన్మానం చేశారు. కార్యక్రమంలో అడ్మిన్ డిసిపి శిల్పవల్లి పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News