Monday, April 29, 2024

ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు బస్సు యాత్రకు ప్లాన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మొదటి విడత జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ, ఈనెల 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు 15కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల 18వ తేదీన బస్సుయాత్రను జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రాహుల్‌గాంధీ ప్రారంభించనున్నారు. ఈ బస్సు యాత్ర షెడ్యూల్‌లో భాగంగా నిజామాబాద్ వద్ద భారీ బహిరంగసభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 18వ తేదీన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం రాహుల్, ప్రియాంకగాంధీ ఈ యాత్రను ప్రారంభిస్తారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ యాత్ర ప్రతిరోజు మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో కొనసాగేలా టిపిసిసి కార్యాచరణ రూపొందించింది.

ప్రతి నియోజకవర్గంలో ఒక సభ ఉండేలా….
ప్రతి నియోజకవర్గంలో ఒక సభ ఉండేలా, 30 వేలకు తక్కువ లేకుండా జనసమీకరణ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయించింది. నిజామాబాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని పార్టీ అధిష్టానం యోచిస్తోంది. రైతు సమస్యలు సహా పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయనుందో ఆ సభ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు ఎండగట్టడంతో పాటు ఓటర్లను ఆకర్షించేలా ప్రియాంక, రాహుల్ గాంధీ ప్రసంగాలు ఉండేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

రాష్ట్ర నేతలంతా ఐక్యంగా ఉన్నారన్న సంకేతాలను జనంలోకి తీసుకెళ్లడానికి ఆ బస్సు యాత్ర దోహదపడుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రెండు, మూడు రోజుల విరామం తర్వాత తిరిగి బస్సుయాత్ర ఉంటుందని పిసిసి వర్గాలు చెబుతు న్నాయి. ఈ బస్సు యాత్రలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, స్టార్ క్యాంపెనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News