Monday, April 29, 2024

కల్వకుర్తి బయలుదేరిన రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ శంషాబాద్ నోవాటెల్ నుంచి కల్వకుర్తి బయలుదేరారు. వెల్డండ మండంలోని తండాలో లంబాడీ సామాజిక వర్గంతో కలిసి భోజనం చేయనున్నారు. రాహుల్ నాగర్‌కర్నూల్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించనున్నారు. నాగర్‌కర్నూల్‌లోని కల్వకుర్తిలో మధ్యాహ్నం 2.30 గంటలకు రాహుల్ గాంధీ తొలి బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఆ తర్వాత మహబూబ్‌నగర్‌లో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. మహబూబ్‌నగర్‌లోని జడ్చర్ల డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద కార్నర్‌ సమావేశంలో పాల్గొని షాద్‌నగర్‌ రైల్వేస్టేషన్‌ నుంచి షాద్‌నగర్‌ చౌరస్తా వరకు 750 మీటర్ల మేర పాదయాత్ర నిర్వహించనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News