Monday, April 29, 2024

శ్రీనగర్‌లో రాహుల్ గాంధీ వ్యక్తిగత పర్యటన: సోనియా కూడా రాక

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: రెండు రోజుల వ్యక్తిగత పర్యటన నిమిత్తం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం శ్రీనగర్ సందర్శించనున్నారని, మరుసటి రోజు ఆయన తల్లి సోనియా గాంధీ శ్రీనగర్ వస్తారని జమ్మూ కశ్మీరు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వికార్ రలూల్ వాని శుక్రవారం తెలియచేశారు. అయితే ఈ కుటుంబ పర్యటన సందర్శంగా ఈ ఇద్దరు సీనియర్ నాయకులు ఎటువంటి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనబోరని, పార్టీ నాయకులు ఎవరినీ శ్రీనగర్‌లో కలుసుకోవడం లేదని ఆయన చెప్పారు.

గత వారం రోజులుగా కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో రాహుల్ పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం కార్గిల్‌లో ఒక బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ఆయన శ్రీనగర్‌కు బయల్దేరతారని ఆయన చెప్పారు. శనివారం సోనియా గాంధీ రాహుల్‌ను శ్రీనగర్‌లో కలుసుకుంటారని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News