- Advertisement -
హైదరాబాద్ : ఇప్పటికే నగరంతో పాటుగా జిల్లాల్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. రానున్న మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ ఛత్తీస్ గఢ్ నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా 3.1 కి.మీల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతోనే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వివరించింది. తూర్పు బిహార్ దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని పేర్కొంది. ఈ అల్పపీడనం రేపు బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ప్రాణ, ఆస్తి నష్టాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని ఆధికారులను ఆదేశించింది.
- Advertisement -