Friday, May 3, 2024

2 నుంచి 8 ఏళ్ల ముందే వర్షపాతం అంచనా

- Advertisement -
- Advertisement -

ఐవొడి సంకేతాలతో సాధ్యమే : హెచ్‌సియు పరిశోధకుల వెల్లడి

Gulab Cyclone: Heavy Rains in AP
హైదరాబాద్ : దేశంలో వచ్చే 2 నుంచి 8 ఏళ్లలో వర్షపాతం ఎలా ఉంటుందో ముందే అంచనా వేయగలగడం సాధ్యమేనని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సియు) పరిశోధకులు చెబుతున్నారు. హిందూ మహాసముద్రం డైపోల్ (ఐఒడి) ఆధారంగా ఇప్పటివరకు ఆరునెలలు ముందుగా మాత్రమే దేశంలో రుతుపవనాల తీరును అంచనా వేస్తున్నారు. తమ పరిశోధన ఫలితాలతో 2 నుంచి 8 ఏళ్లలో కురిసే వర్షపాతాన్ని ముందే గుర్తించడం సాధ్యమౌతుందని వీరు స్పష్టం చేస్తున్నారు. ఐఒడి ఆధారంగా వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు , హెచ్‌సియు లోని భూమి, సముద్ర వాతావరణ శాస్త్ర కేంద్రం ఆచార్యుడు అశోక్ నేతృత్వంలో పిహెచ్‌డి విద్యార్థిని పెటాఫ్రాన్సిస్ , ఈ కేంద్రం మాజీ ఛైర్ ప్రొఫెసర్ సతీష్ షెత్యే పరిశోధన చేపట్టారు. వీరికి యుకెకు చెందిన ఎగ్జెటర్ వర్శిటీ ఆచార్యుడు మ్యాట్ కొలిన్స్ సహకారం అందించారు. 1980 నుంచి 2011 మధ్య ఉన్న వాతావరణ పరిస్థితులను వీరు విశ్లేషించారు. ఇందులో ఐఒడి సూచీల ఆధారంగా 2 నుంచి 8 సంవత్సరాల ముందే రుతుపవనాలు , ఇతర వాతావరణ స్థితి గతులను అంచనా వేసేందుకు అవకాశం ఉందని తేల్చారు.

దక్షిణ మహాసముద్ర జలాల ఆధారంగా…

ఐఒడిలో ప్రతికూల సూచీలు కనిపిస్తే వర్షపాతం తక్కువగా ఉంటుంది. సానుకూల సూచీలు కనిపిస్తే వర్షాలు ఎక్కువగా కురుస్తాయని అంచనా వేస్తారు. ఐవొడి అనేది దక్షిణ మహాసముద్రం నుంచి వచ్చే జలాలపై ఆధారపడి ఉందని హెచ్‌సీయూ పరిశోధకులు గుర్తించారు. దక్షిణ మహా సముద్రం నుంచి నీటి ప్రవాహం హిందూ మహాసముద్రాన్ని చేరేందుకు ఎనిమిదేళ్లు పడుతుంది. ఆ మేరకు 8 ఏళ్లు ముందుగానే వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు సంకేతాలను గుర్తించే వీలుందని ప్రొఫెసర్ అశోక్ వివరించారు. ఐవొడిలో పాజిటివ్ సూచీలు రావడంతో 1961,1963,1967,1994,1997,2007,2019 లో దేశంలో భారీ వర్షాలు కురిశాయని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News