Sunday, April 28, 2024

హైదరాబాద్‌ లో ‘రక్షాబంధన్‌’ టీమ్ సందడి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాలీవుడ్ కిలాడీ అక్షయ్‌కుమార్‌ తాజా చిత్రం ‘రక్షాబంధన్‌’. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న చిత్ర బృందం, తమ చిత్ర ప్రచార కార్యక్రమాలలో భాగంగా పలు నగరాలలో సందడి చేస్తున్నారు. సోమవారం ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా అక్షయ్ తోపాటు సాడియా ఖతీబ్‌, స్మృతి శ్రీకాంత్‌, సహేజ్మీన్‌ కౌర్‌, దీపికా ఖన్నాలు హైదరాబాద్ లో సందడి చేశారు. రక్షాబంధన్‌ పండుగ సందర్భంగా విడుదల కాబోయే ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఈ బృందం హైదరాబాద్‌ వచ్చింది. ఇప్పటికే ఈ చిత్ర బృందం దుబాయ్‌, పూనె, ఇండోర్‌లలో సందడి చేసింది. ఇండోర్‌ పర్యటన తరువాత, ఈ చిత్ర బృందం హైదరాబాద్‌కు వచ్చింది. పీవీఆర్‌ లో మీడియా సమావేశంలో పాల్గొన్న వీరు అనంతరం చార్మినార్‌ వద్ద సందడి చేశారు. హైదరాబాద్‌కు తలమానికమైన చార్మినార్‌ వద్ద ఫోటోలనూ దిగారు. తమ అభిమాన సూపర్‌స్టార్‌ తో పాటుగా చిత్ర బృందాన్ని దగ్గరగా చూసేందుకు, వారితో ముచ్చటించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలను జీ స్టూడియోస్‌తో కలిసి ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ మరియు హిమాంశు శర్మ, అల్కా హిరానందానీ, కేప్‌ ఆఫ్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ తీసుకున్నాయి. హిమాంశు శర్మ మరియు కనికా ధిల్లాన్‌లు రచన చేయగా, రక్షాబంఽధన్‌కు సంగీత దర్శకత్వంను హిమేష్‌ రేష్మియా చేశారు. ఈ చిత్రంలోని పాటలకు సాహిత్యాన్ని ఇర్షాద్‌ కమిల్‌ అందించారు.

రక్షా బంధన్‌ చిత్రంలో భూమి పద్నేకర్‌, అక్షయ్‌కుమార్‌, నీరజ్‌ సూద్‌, సీమా పహ్వా, సాదియా ఖతీబ్‌, అభిలాష్‌ థపిల్యాల్‌, దీపికా ఖన్నా, స్మృతి శ్రీకాంత్‌ మరియు సహెజ్మీన్‌ కౌర్‌లు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఆగస్టు 11, 2022 న విడుదల కానుంది.

‘Raksha Bandhan’ Team Promotions in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News