Saturday, April 27, 2024

శంకర్‌ను కలిసిన రామ్‌చరణ్, దిల్ రాజు..

- Advertisement -
- Advertisement -

దక్షిణాది అగ్ర దర్శకుడు శంకర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ కలిసి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇది చరణ్ కెరీర్‌లో 15వ సినిమా.. దిల్ రాజు బ్యానర్ కు 50వ చిత్రం. అయితే ‘ఇండియన్ 2’ సినిమా వివాదం కోర్టు దాకా వెళ్లడం.. ఈ సినిమా పూర్తయ్యే వరకు శంకర్ మరో సినిమాను డైరెక్ట్ చేయకూడని కేసు వేయడంతో ‘ఆర్‌సి 15’ ప్రాజెక్ట్ ఇప్పట్లో ప్రారంభం అవుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ‘ఇండియన్ 2’ వివాదంలో శంకర్‌కు ఊరట లభించింది. లైకా ప్రొడక్షన్స్ వేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. దీంతో శంకర్ తదుపరి ప్రకటించిన సినిమాలను డైరెక్ట్ చేసుకునే అవకాశం కలిగింది. ‘చరణ్- శంకర్’ పాన్ ఇండియా చిత్రం పట్టాలెక్కేందుకు మార్గం సుగమమైంది.

ఈ నేపథ్యంలో హీరో రామ్‌చరణ్, ప్రొడ్యూసర్ దిల్ రాజు చెన్నై వెళ్లి డైరెక్టర్ శంకర్‌ను కలిశారు. ‘ఆర్‌సి 15’ ప్రాజెక్ట్ గురించి చర్చించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా సెట్స్‌పైకి తీసుకెళ్లాలని మేకర్స్ నిర్ణయించుకున్నారని తెలిసింది. చెన్నైలో శంకర్, చరణ్, దిల్ రాజు కలిసి దిగిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇకపోతే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తవగా.. రెండు పాటలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే రామ్‌చరణ్ తన తండ్రి చిరంజీవితో కలిసి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ మరో పది రోజుల్లో పూర్తవుతుంది. ఈ రెండు సినిమాలు పూర్తి చేసి శంకర్ ప్రాజెక్ట్‌లో చరణ్ చేరే అవకాశం ఉంది.

Ram Charan and Dil Raju meets Director Shankar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News