ముంబయి: ఓ మహిళపై అత్యాచారం చేసిన అనంతరం ప్రైవేట్ పార్ట్లలో ఇనుప రాడ్ ను జొప్పించిన అమానుష సంఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గోండియా జిల్లాలో యోగిలాల్ రహాంగ్దాలే అనే వ్యక్తి స్పిన్నింగ్ మిల్లులో సూపర్వైజర్గా పని చేసేవాడు. ఓ మహిళ అదే మిల్లులో దినసరి కూలీగా పని చేస్తోంది. పర్డి ప్రాంతంలో సదరు మహిళ తన సహోదరుడు, స్నేహితురాలితో కలిసి గది అద్దెకు తీసుకొని ఉంటుంది. ఆమె సహోదరుడు, స్నేహితురాలు వాళ్ల గ్రామానికి వెళ్లినప్పుడు ఆమె ఒంటరిగా ఉండడం యోగిలాల్ గమనించాడు. జనవరి 21న అదే రాత్రి ఆమెపై అతడు అత్యాచారం చేశాడు. అనంతరం ప్రైవేటు పార్ట్లలో రాడ్ను జొప్పించి వెళ్లిపోయాడు. 24న తన సహోదరుడు వచ్చిన వెంటనే విషయం తెలియడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో అతడిపై ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని స్థానిక ఇన్స్పెక్టర్ సునీల్ చవాన్ తెలిపాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని వివరించారు. బాధితురాలిని ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.