హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి)లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు ఆయన పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. కోవిడ్-19 నిబంధనల మేరకు వేడుకలను నిర్వహించారు. అదేవిధంగా కొత్త పాలక మండలి ఏర్పాటుతో భాగంగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండడంతో ఏలాంటి సందేశాలు లేకుండానే ముగించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్, జిహెచ్ఎంసి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, అడిషనల్ కమీషనర్లు ప్రియాంకా అల, జయరాజ్ కెనడి, శంకరయ్య, కృష్ణ, యాదగిరి రావ్, పంకజ, సరోజ, సిసిపి దేవందర్రెడ్డి, సిఈ జియాఉద్దీన్, ఓఎస్డి సురేశ్, సిపిఆర్ఓ వెంకట రమణ పలువురు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
జిహెచ్ఎంసిలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -