Saturday, May 11, 2024

రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కి ప్రమాదం.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డ పిసిసి చీఫ్

- Advertisement -
- Advertisement -

 Revanth reddy convoy accident

మన తెలంగాణ/హైదరాబాద్: పిసిసి చీఫ్, మల్కాజిగిరి ఎంపి రేవంత్‌రెడ్డి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆయన కాన్వాయికి పెనుప్రమాదం తప్పింది. తూప్రాన్ మండలం ఇమాంపూర్ వద్ద కాన్వాయిలోని కార్లు ఒక్కదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నాలుగు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి.

ఆదివారం ‘మన ఊరు .. మన-పోరు’ బహిరంగ సభను కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేశారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఈ సభకు రేవంత్‌రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి వెళ్తుండగానే రేవంత్ కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరుగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రేవంత్ మరో వాహనంలో ఎల్లారెడ్డికి వెళ్లినట్లుగా తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News