Sunday, April 28, 2024

అతివేగంతో లారీని ఢీకొని అన్నాచెల్లెలు మృతి

- Advertisement -
- Advertisement -

హసన్‌పర్తి: లారీని ద్విచక్ర వాహనం అతివేగంతో వెనుక నుంచి ఢీకొట్టిన సంఘటనలో అన్నా చెల్లెలు మృతి చెందిన సంఘటన హన్మకొండ జిల్లా ఔటర్‌రింగ్ రోడ్డుపై శుక్రవారం చోటు చేసుకుంది. హసన్‌పర్తి మండలం నాగారం గ్రామానికి చెందిన సుమిత్‌రెడ్డి (26), పూజారెడ్డి (22) అన్నాచెల్లెలు కాగా తండ్రి దేవేందర్‌రెడ్డి ఇప్పటికే చనిపోగా వీరు హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ తల్లిని చూసుకుంటున్నారు. ఈ క్రమంలో తల్లి సుజాత వారి ఇంటికి రమ్మని చెప్పడంతో శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి సుమిత్‌రెడ్డి పల్సర్ బైక్‌పై ఇద్దరు హన్మకొండకు బయలుదేరారు.

కాగా కరుణాపురం రాంపూర్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ముందు వెళ్తున్న లారీని బైక్ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో అన్నా చెల్లెలు అక్కడికక్కడే మృతిచెందారు. గతంలోనే భర్త చనిపోవడం ఇప్పుడు చేతికి అంది వచ్చిన ఇద్దరు పిల్లలు మృతిచెందిన విషయం తెలుసుకున్న తల్లి, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపిస్తున్న తీరు అక్కడున్న వారందరినీ కన్నీరు పెట్టించింది. ఈ విషయం తెలుసుకున్న ధర్మసాగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీయించి వరంగల్ ఎంజీఎంకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News