- Advertisement -
చెన్నై: ఇంగ్లాండ్-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో 420 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 12 పరుగులు చేసి జాక్ లీచ్ బౌలింగ్ లో ఔటయ్యారు. ఇంకా ఇంగ్లాండ్ 381 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత బ్యాట్స్మెన్లు శుభ్మన్ గిల్ (15), ఛటేశ్వరా పుజారా(12) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఇంగ్లాండ్ 178 పరుగులు ఆలౌటైంది.
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 578
ఇండియా తొలి ఇన్నింగ్స్: 337
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 178
- Advertisement -