Saturday, May 25, 2024

ఇండియా టార్గెట్ 420

- Advertisement -
- Advertisement -

India target is 420 runs in eng vs ind

 

చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్సింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు నాలుగో రోజు 46.3 ఓవర్లలో 178 పరుగులు చేసి ఆలౌటైంది. భారత్‌కు 420 పరుగుల లక్ష్యాన్ని ముందు ఉంచింది.  టీమిండియా బౌలర్ అశ్విన్ ధాటికి ఇంగ్లాండ్ 178 పరుగులకే చేతులెత్తేసింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లలో జోయ్ రూట్ (40), ఓలీ పోప్ (28), డోమినిక్ బెస్ (25), బట్లర్ (24), డెనియల్ లారెన్స్(18), డోమినిక్ సిబ్లే(16), జాక్ లీచ్(08), బెన్ స్టోక్స్(07), జోఫ్రా ఆర్చార్(05), రోరీ బర్న్(0) పరుగులు చేసి ఔటయ్యారు. భారత్ బౌలర్లలో రవీచంద్రన్ అశ్విన్ ఆరు వికెట్లు పడగొట్టగా షాబాజ్ నాదీమ్ రెండు వికెట్లు, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా చెరో ఒక వికెట్ తీశారు.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 578

ఇండియా తొలి ఇన్నింగ్స్: 337

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News