Monday, April 29, 2024

హైదరాబాద్ నుంచి చెన్నై, షిర్డీ, విశాఖపట్నం, కాకినాడ, అమలాపురానికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  ఆర్టీసి ప్రయాణికులకు గుడ్ న్యూస్. వరుస సెలవుల నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో సుదూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు టిఎస్ ఆర్టీసి ప్రకటించింది. హైదరాబాద్ నుంచి చెన్నై, షిర్డీ, విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, తదితర ప్రాంతాలకు ఈ ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్టు ఆర్టీసి ఎండి సజ్జనార్ వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం ప్రయాణికులు టిఎస్ ఆర్టీసి అధికారిక వెబ్‌సైట్ http:// tsrtconline.inలో టికెట్లను బుకింగ్ చేసుకోవాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలకు టిఎస్ ఆర్టీసి కాల్ సెంటర్ నెంబర్లు 040-60440000, 040- 23450033లలో సంప్రదించాలని ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News