Monday, April 29, 2024

గుంత కనిపించగానే ఫోటోకు ఫోజులిస్తున్నారు: సజ్జల

- Advertisement -
- Advertisement -

135 nominated posts to be filled in andhra pradesh

అమరావతి: ఎవరో వస్తున్నారని ఉలిక్కిపడి ఏదో చేయాల్సిన అవసరం లేదని వైసిపి నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. గుంత కనిపించగానే ఫొటోకు ఫోజులు ఇవ్వాలనుకుంటే తాము ఆహ్వానిస్తామని, మీడియాలో చర్చలకు, ప్రచారానికే పరిమితం అవ్వాలనుకుంటున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. టిడిపి పాలనలో కంటే తాము మెరుగ్గా రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మాట్లాడి తన స్థాయిని దిగజార్చుకోలేనని స్పష్టం చేశారు. ఒకరి మద్దతు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయలేని స్థితిలో పవన్ కల్యాణ్ ఉన్నారని చురకలంటించారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి సమర్థత వల్లే ప్రజల విశ్వాసం పొందగలుగుతున్నామని, బద్వేల్ ఉప ఎన్నికలలో జనసేన-టిడిపి కలిసి పోటీ చేసే ఆలోచనలో ఉన్నాయని ఆరోపణలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News