Monday, April 29, 2024

ఢిల్లీలో ఒమిక్రాన్ రెండో కేసు నమోదు..

- Advertisement -
- Advertisement -

Second Omicron Case registered in Delhi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రెండవ కొత్త కొవిడ్-19 వేరియంట్ ఒమిక్రాన్ కేసు నమోదైంది. జింబాబ్వే, దక్షణిఫ్రికా నుంచి వచ్చిన ఒక 35ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు శనివారం వర్గాలు తెలిపాయి. ఆ వ్యక్తిని ఇక్కడి ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో చేర్చారని, అతనికి నీరసం తప్ప వేరే లక్షణాలు ప్రస్తుతం లేవని వర్గాలు తెలిపాయి. ఆ వ్యక్తి జింబాబ్వే నుంచి భారత్‌కు తిరిగివచ్చాడని, అతను దక్షిణాఫ్రికాలో కూడా ప్రయాణించాడని వారు చెప్పారు. కాగా, ఆ వ్యక్తికి రెండు డోసుల వ్యాక్సినేషన్ కూడా పూర్తయినట్లు వారు చెప్పారు. ఒమిక్రాన్ రోగుల చికిత్స కోసం ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిని ప్రత్యేకంగా కేటాయించారు. గత ఆదివారం టాంజానియా నుంచి ఢిల్లీ చేరుకున్న ఒక 37 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో దేశ రాజధానిలో ఒమిక్రాన్ తొలి కేసు నమోదైంది. ఆ వ్యక్తి కూడా రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకోవడం గమనార్హం.

Second Omicron Case registered in Delhi

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News