Monday, April 29, 2024

‘శంషాబాద్’లో కిలో బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

Seizure of a kilo of gold in Shamshabad

 

మనతెలంగాణ/హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం నాడు రూ.43.55 లక్షల విలువ చేసే కిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. లగేజీని తనిఖీ చేయగా పేస్ట్ రూపంలో బంగారం తెచ్చినట్లు గుర్తించిన అధికారులు ఆ బంగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.43.55 లక్షలుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కాగా గురువారం నాడు సైతం సుమారు 24 లక్షల విలువైన 495 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి చెప్పులు, ఫేస్ క్రీములలో దాచుకుని తీసుకురావడాన్ని గుర్తించిన అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News