- Advertisement -
ఢిల్లీ: ఫిబ్రవరి 8 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గెలిస్తే షహీన్బాగ్ ఖాళీ అయ్యే ప్రక్రియ ప్రారంభమౌతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం చెప్పారు. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎన్నికల ప్రచారానికి దూరమైన అనురాగ్ ఠాకూర్ ఢిల్లీ బిజెపి కార్యాలయంలో ఒక కార్యక్రమంలో మాట్లాడారు. ఢిల్లీ ప్రజలు కమలానికి అనుకూలంగా ఓట్లు వేస్తే ఫిబ్రవరి 11న ఫలితాలు వెల్లడైన తరువాత షహీన్బాగ్ ఆందోళన స్థలం పూర్తిగా ఖాళీ అవుతుందని ఆయన అన్నారు.
Shaheenbagh is empty if BJP wins Delhi elections
- Advertisement -