హైదరాబాద్: టాలీవుడ్ అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో తెలుగు చలన చిత్ర రంగానికి సంబంధించిన పలు విషయాలతో పాటు తాజాగా రాజకీయ అంశాలు వీళ్ల మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. ఈ ముగ్గురి భేటికి చిరంజీవి ఇల్లు వేదికైయింది. చిరు ఇంటికే నాగార్జున, తలసాని శ్రీనివాస్ యాదవ్ విచ్చేసారు. మొన్నటి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తంగా టీఆర్ఎస్ ప్రభంజనం వీచడం.. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తలసానిని చిరు, నాగార్జునలతో భేటి కమ్మని ముఖ్యమంత్రి కెసిఆర్ పంపించినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చిరంజీవి విషయానికొస్తే.. ప్రస్తుతానానికి చిరు తన దృష్టిని పూర్తిగా సినిమాలకే పరిమితం చేసారు. మళ్లీ రాజకీయాల వైపు దృష్టిసారింలేదు. ఈ నేపథ్యంలో చిరు మరోసారి రాజకీయాలపై దృష్టి మరలుస్తారా అనేది కీలకంగా మారింది. మొత్తంగా రెండు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ ఉన్న ఈ సమయంలో తలసాని.. తెలుగులో సీనియర్ అగ్రనటులైన నాగార్జున, చిరంజీవిని కలవడం ఇపుడు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
కాగా, సైరా నరసింహారెడ్డి తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చిరు ఒక సినిమా చేస్తున్నాడు. దేవాలయల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కింగ్ నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమా చేస్తున్నాడు.
Minister Talasani Meet with Chiranjeevi and Nagarjuna