Monday, April 29, 2024

పారితోషికం పెంచేసింది

- Advertisement -
- Advertisement -

Shruti Haasan has raised her Remuneration

 

’అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన శృతిహాసన్… ఓ మై ఫ్రెండ్, బలుపు, ఎవడు, గబ్బర్ సింగ్, రేసుగుర్రం, శ్రీమంతుడు, ప్రేమమ్ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. అయితే ‘కాటమరాయుడు’ సినిమా తర్వాత కొన్నాళ్ళు టాలీవుడ్‌కి దూరమైంది. ఈ నేపథ్యంలో మూడేళ్ళ గ్యాప్ తర్వాత ‘క్రాక్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘క్రాక్’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో మళ్లీ శృతికి వరుస ఆఫర్స్ వస్తున్నాయని తెలిసింది. అయితే సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న శృతి.. రెమ్యూనరేషన్ కూడా పెంచేసిందని సమాచారం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, – ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ‘సలార్’ సినిమాలో శృతిహాసన్‌ని హీరోయిన్‌గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం ఈ అమ్మడు కోటి రూపాయలకు పైగా డిమాండ్ చేసిందట. ఇది క్రాక్, వసూల్ సాబ్ కంటే ఎక్కువని తెలిసింది. దీనికి మేకర్స్ పాజిటివ్‌గా స్పందించడంతో ‘సలార్’ కోసం శృతి బల్క్ డేట్స్ కేటాయించిందని టాక్ నడుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News