Saturday, April 27, 2024

అక్కతో గొడవ… చెల్లి ప్రాణం తీసిన టివి

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: టివి చూడడం కోసం రిమోట్ కావాలని అక్కతో గొడవపడి చెల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కేరళలోని ఇడుక్కి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఇడుక్కి ప్రాంతంలో 11 ఏళ్ల బాలిక తన అక్క, కజీన్ తో కలిసి టివి చూస్తోంది. తనకు ఇష్టమైన చానల్ పెట్టుకుంటానని రిమోట్ కావాలని అక్కను అడిగింది. ఇద్దరు మధ్య గొడవ జరగడంతో చెల్లి తన బెడ్ రూమ్ లోకి వెళ్లిపోయింది. డోర్ లాక్ చేసుకొని కిటికీ గ్రిల్స్ కు తాడు కట్టి ఉరేసుకుంది. గదిలో వెళ్లిన చెల్లి రాకపోవడంతో అక్క డోర్ తట్టింది. ఎంతకు డోర్ తీయకపోవడంతో అనుమానం వచ్చి డోర్ బద్దలుకొట్టి చూడగా గ్రిల్స్ కు బాలిక వేలాడుతూ కనిపించింది. బాలికను కిందకు దించి చూడగా అప్పటికే ఆమె చనిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News