Monday, April 29, 2024

మంటల్లో చిక్కుకొని ఆరుగురు చిన్నారులు సజీవదహనం

- Advertisement -
- Advertisement -

Six children burnt alive in bihar

పాట్నా: బీహార్ రాష్ట్రం అరారియా జిలా కవాయాలో విషాదం చోటుచేసుకుంది. మంటల్లో చిక్కుకొని ఆరుగురు చిన్నారులు సజీవదహనమయ్యారు. పూరీ గుడిసెకు మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు తెలిపారు. గుడిసెలో ఉన్న పిల్లలను రక్షించడానికి గ్రామస్థులు శతవిధాలా ప్రయత్నించినప్పటికి మంటలు ఎగిసిపడడంతో రక్షించలేకపోయారు. కవాయా గ్రామస్థులు సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయా? లేక ఎవరైనా కావాలని మంటలు అంటించారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News