Saturday, April 27, 2024

ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

six killed in road accident near tamil nadu

చెన్నై: తమిళనాడులో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విలుప్పురం జిల్లా టిండివనం సమీపంలో అదుపుతప్పిన ఓ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబంలోని ఆరుగురు మృతి చెందగా… ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఓ చిన్నారి ఉన్నట్టు తెలుస్తోంది. తిరునెల్వేలి జిల్లా నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతులను తిరునెల్వేలి జిల్లాకు చెందిన మురుగేష్, 40, మురుగరాజ్, 38, సోరి మురుగన్, 35, మలార్, 30, రాజి, ముత్తు మనీషాగా గుర్తించారు. ఉదయం 6 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసునమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించినట్టు పోలీసులు తెలిపారు.

six killed in road accident near tamil nadu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News