Monday, April 29, 2024

తెలంగాణ అభివృద్ధి బిజెపితోనే సాధ్యం: స్మృతి ఇరానీ

- Advertisement -
- Advertisement -

దుబ్బాక : కెసిఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మైనార్టీ శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. శుక్రవారం దుబ్బాక పట్టణంలోని తిరుమల గార్డెన్స్‌లో ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన నారీ శక్తి వందన్ మహిళా సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ మైనారిటీ శాఖ మంత్రి స్మృతి ఇరానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రావాలని ఈ ప్రాంతంలో ఉన్న కోట్లాది మంది తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని కొట్లాడం జరిగిందని తెలంగాణ వచ్చిన తర్వాత వారి ఆశలు ఇవి నెరవేరలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు కేవలం 40,000 కోట్లతో ప్రారంభించిన ప్రాజెక్టును లక్ష కోట్లకు మించినా కాని నేటికీ 60 శాతం ప్రజలకు కాళేశ్వరం నీటిని ఇంత వరకు అందించలేకపోవడం జరిగిందన్నారు. వ్యవసాయ రంగానికి నీళ్లు అందించడంలో కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పుడు మిగులు బడ్జెట్ కలిగి ఉన్న రాష్ట్రం తెలంగాణ అని కానీ నేడు 5 లక్షల కోట్ల రూపాయలను అప్పులు చేసి తన కుటుంబ ఖజానాకు వ్యక్తి కెసిఆర్ అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన కెసిఆర్ నేటి వరకు నియామక ప్రక్రియను సరిగ్గా జరపలేకపోయిండన్నారు. కెసిఆర్ తన కుటుంబంలో అందరికి ఉద్యోగాలు ఇచ్చుకొని తెలంగాణ యువతను వంచించిన ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం అన్నారు. నీళ్లు నిధులు నియామకాల విషయంలో కెసిఆర్ చెప్పిందొకటి చేసింది ఒకటి అని తీవ్రంగా విమర్శించారు. ఈ దేశంలో కరోనా వచ్చినప్పుడు ప్రపంచమంతా భయపడుతుంటే ప్రతి ఇంటికి తిరిగి దేశ ప్రజలందరికీ డబ్బులతో సంబంధం లేకుండా వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం అని అన్నారు. దేశ ప్రజలను ఆదుకున్న చరిత్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం అని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేద ప్రజలకు డబుల్ బెడ్ రూంలు ఇచ్చిన ఘనత నరేంద్రమోడీ సర్కార్ అన్నారు.ఇదే తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూంలు నేటి వరకు సంపూర్ణంగా పేద ప్రజలకు అందివ్వలేదని అన్నారు.

స్వయంగా సిఎం కెసిఆర్ దళితబంధు విషయంలో ఎమ్మెల్యేలు 30శాతం కమిషన్ తీసుకుంటే ఎమ్మెల్యేలను హెచ్చరించింది నిజం కాదని ప్రజల ఆలోచించాలన్నారు. తెలంగాణ సాధనలో జయ జయహే తెలంగాణ అనే కవితను రాసిన అందెశ్రీ పాటను నేటి వరకు తెలంగాణ రాష్ట్ర కవితగా ఎందుకు ఆవిష్కరించలేదో తెలపాలన్నారు. మెగా టైల్స్ తెలంగాణకు అందించిన ఘనత బిజెపి ప్రభుత్వందే అన్నారు. టిఎస్‌పిఎస్‌సి పరీక్షల్లో అవినీతి అక్రమాలకు పాల్పడ్డది తెలంగాణ ప్రభుత్వం అన్నారు. 6 లక్షల మంది చిరు వ్యాపారులకు ముద్ర లోన్ క్రింద ఆర్థిక సాయం అందించింది కేంద్ర ప్రభుత్వం అన్నారు. సిద్దిపేటకు రైలు కూడా అందించింది బిజెపి ప్రభుత్వం అన్నారు. సిద్దిపేట వరంగల్ కరీంనగర్ సిటీ ను స్మాల్ సిటీలుగా గుర్తించింది కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతిపై కెసిఆర్ ప్రభుత్వం పై పోరాడుతున్న రఘునందన్ రావును దుబ్బాక ఎమ్మెల్యేగా మరో మార్ గెలిపించి ఆశీర్వదించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News