హైదరాబాద్: 2020 సంవత్సరం వెళుతూ.. వెళుతూ ఓ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో పడేసింది. కుటుంబానికి అండగా ఉన్న యువకుడు తన పని చేసుకుంటూ ఉండగా ఇంట్లోకి ప్రవేశించిన కోతిని అదిలించబోయి కుటుంబసభ్యుల ముందే ప్రాణాలను పోగొట్టుకున్న సంఘటన కూకట్ పల్లిలో చోటు చేసుకుంది. జయనగర్లో ఇటీవల కోతుల బెడద ఎక్కువైంది, కాగా జయానగర్లో నివాసం ఉంటున్న లోకేష్ రెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగి, స్థానికంగా ఓ అపార్ట్మెంట్లోని రెండో ఫ్లోర్లో నివసిస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్లో భాగంగా ఇంట్లో నుండే విధులను నిర్వర్తిస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం అతని భార్య ఇంట్లోకి కోతులు వచ్చాయని చెప్పడంతో కోతులను బెదర గొట్టేందుకు అందుబాటులో ఉన్న డోర్ కర్టెన్ ఇనుపరాడ్తో కొట్టేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లకు తగలడంతో విద్యుత్ షాక్కు గురైయ్యాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఓప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే లోకేష్ ప్రాణాలను కోల్పోయాడు దీంతో కుటుంబంలోనూ కాలనీలోనూవిషాద ఛాయలు అలుముకున్నాయి.
కోతిని కొట్టబోయి ప్రాణాలను పోగొట్టుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి
- Advertisement -
- Advertisement -
- Advertisement -