Sunday, April 28, 2024

తల్లి గొంతుకోసిన తనయుడు

- Advertisement -
- Advertisement -

Son murdered his mother

ఆంధ్రప్రదేశ్ : వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చంటిపాపల్లా కాపాడాల్సిన ఓ తనయుడు ఉన్మాదిలా మారి ఆమె గొంతుకోసి హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని చిలకలూరిపేట మండలం రాజాపేటలో జరిగిన దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తల్లి ఆదిశేషమ్మను కుమారుడు వీరయ్య ఇవాళ తెల్లవారుజామున ఓగేరు వాగు వద్ద బ్లేడుతో గొంతుకోసి అక్కడే వదిలేసి పారిపోయాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం హుటాహుటినా గుంటూరులోని జీజీహెచ్‌ ఆస్పత్రికి తరలించారు. ఆమె చికిత్సపొందుతూ మృతి చెందింది. పోలీసులు ఆస్పత్రికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News