Monday, April 29, 2024

సూర్యాకుమార్ మెరుపులు… సౌతాఫ్రికా టార్గెట్ 134

- Advertisement -
- Advertisement -

 

పెర్త్: టి20 ప్రపంచ కప్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ముందు టీమిండియా 134 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. సూర్యాకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. సూర్యాకుమార్ 40 బంతుల్లో 68 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ(15), విరాట్ కోహ్లీ(07), కెఎల్ రాహుల్(09), హార్ధిక్ పాండ్యా(02) వికెట్లను తీసిన ఎంగిడి భారత్ నడ్డి విరిచాడు. దీపక్ హుడా డకౌట్ రూపంలో మైదానం వీడాడు. దినేష్ కార్తీక్ ఆరు పరుగులు చేసి పర్నెల్ బౌలింగ్‌లో రోసోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి నాలుగు వికెట్లు తీయగా పార్నెల్ మూడు వికెట్లు, నోర్ట్జ్ ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News