Monday, April 29, 2024

పోసాని ఇంటిపై రాళ్లదాడి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన పోసాని

- Advertisement -
- Advertisement -

Stone pelting on posani krishna murali house

హైదరాబాద్: సినీనటుడు పోసాని కృష్ణమురళి ఇంటిపై బుధవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై ఇటీవల హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో పోసాని, పవన్‌కల్యాణ్ అభిమానుల మధ్య గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొందరు వ్యక్తులు ఎల్లారెడ్డి గూడలో ఉన్న పోసాని ఇంటిపై మోటార్ సైకిల్‌పై వచ్చిన వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో సూపర్ వైజర్ పురుషోత్తం ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనలో పోసాని ఇంటిలో పనిచేస్తున్న ఇద్దరికి ప్రమాదం తప్పింది, అసభ్య పదజాలంతో దూషిస్తూ రాళ్లు విసిరినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోసాని ఇంటి సమీపంలోని సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. పోసాని, పవన్‌కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేయడంతో దుండగులు రాళ్ల దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

పదేళ్ల నుంచి పనిచేస్తున్నాం…

పదేళ్ల నుంచి పోసాని ఇంట్లో పనిచేస్తున్నామని పనిమనిషి శోభ చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ పోసాని కుటుంబం ఎనిమిది నెలల నుంచి ఇక్కడ ఉండడంలేదని తెలిపింది. తామే రాత్రి వేళ ఇక్కడ పడుకుంటున్నానమి, అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఇంటిపై రాళ్లు విసిరి, పోసాని భార్యభర్తలను పచ్చి బూతులు తిడుతూ రోడ్డుపై తిరిగారని చెప్పారు. దీంతో తాము భయంతో బయటికి రాలేదని, వెంటనే సూపర్‌వైజర్ పురుషోత్తంకు ఫోన్ చేశామని తెలిపారు. ఆయన ఫోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాత్రి వచ్చి ఉదయం వరకు ఉండిపోయారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News