Monday, April 29, 2024

విద్యార్ధులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

- Advertisement -
- Advertisement -
  • ట్రాఫిక్ సీఐ రామకృష్ణ

సిద్దిపేట క్రైమ్: విద్యార్ధులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సిద్దిపేట ట్రాఫిక్ సీఐ రామకృష్ణ అన్నారు. సోమవారం ఇర్కోడ్ గవర్నమెంట్ హైస్కూల్ విద్యార్థిని, విద్యార్థులకు మైనర్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనల గురించి, రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ శ్వేత ఆదేశానుసారం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు డ్రైవింగ్ ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.

విద్యార్థి దశ నుండి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని సూచించారు. మైనర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాలు నడపవద్దని తెలిపారు. ప్రతిఒక్కరూ రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ఇరువైపులా ఏర్పాటుచేసిన సైనింగ్ బోరడ్స్ సూచనలు సలహాలు పాటిస్తూ సేఫ్టీ గా డ్రైవింగ్ చేసి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. వేగంగా వెళ్లే వాహనానికి, సాధారణ స్పీడ్ తో వెళ్లే వాహనానికి తేలిక 15 నిమిషాలు మాత్రమే తేడా ఉంటుందని తెలిపారు.

మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, కారు నడిపేటప్పుడు సీటు బెల్టు ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి ప్రతి సంవత్సరం భద్రత వారోత్సవాలు ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. వాహనదారులు ప్రజలలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. రోజురోజుకు వాహనాల రద్దీ పెరుగుతుందని దాన్ని దృష్టిలో ఉంచుకొని సేఫ్టీ సెక్యూరిటీగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. రాంగ్ రూట్లో ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడపవద్దని తెలిపారు.

పార్కింగ్ ప్రదేశాలలో వాహనాలు పార్కు చేసుకోవాలని రోడ్డుకు అడ్డదిడ్డంగా వాహనాలు పార్కు చేయవద్దని తెలిపారు. జరిమానా ఫైన్లు వేయడం మా అభిమతం కాదని ప్రమాదాల నివారణ గురించి రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై మాత్రమే జరిమానాలు విధించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన సిగ్నల్స్, నిబంధనలు ఎలా పాటించాలి అనే అంశంపై ఫ్లెక్సీపై ప్రింట్ చేసిన సిగ్నల్స్ చూపిస్తూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల హెడ్ మాస్టర్ పర్శరాములు, అధ్యాపకులు విద్యార్థినీ, విద్యార్థులు ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News