Monday, April 29, 2024

బిగ్ మూవీస్‌తో సూపర్‌స్టార్ దూకుడు

- Advertisement -
- Advertisement -

Pan India offer for Mahesh Babu

ప్రస్తుతం స్టార్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ మాసీవ్ సినిమాలు, యాక్షన్ ప్యాక్ట్ చిత్రాలని చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ కూడా త్వరలో అదే తరహా మూవీతో రావాలని ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని యంగ్ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 ప్లస్ రీల్స్, జీఎంబీ ఎంటర్‌టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా మరింత స్టైలిష్‌గా హీరో మహేష్ కనిపిస్తున్నాడు.

హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలే వున్నాయి. ఇదిలా వుంటే ఈ మూవీని మే 12న విడుదల చేస్తున్నట్టుగా చిత్ర బృందం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత మహేష్ వెంటనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో రూపొందనున్న పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు. ఇటీవలే లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ తరువాత రాజమౌళితో ఓ భారీ మూవీకి మహేష్ శ్రీకారం చుట్టనున్న విషయం తెలిసిందే.

ఆఫ్రికాలోని దట్టమైన అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ మూవీగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోందని… స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని ఇటీవల రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. అయితే ఈ మూవీ తరువాత మహేష్ ఓ మాసీవ్ ఎంటర్ టైనర్ చేయాలనుకుంటున్నాడట. ఊర మాస్ హై వోల్టేజ్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు ఈ మూవీని డైరెక్ట్ చేసే అవకాశం వుందని తెలిసింది. నిజంగా ఈ కాంబినేషన్ సెట్టయితే ఫ్యాన్స్‌కి మహేష్ నుంచి మరో సర్‌ప్రైజ్ రానున్నట్టే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News