- Advertisement -
అర్హులైన ఖైదీలను గుర్తించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీం కోర్టు ఆదేశం
ఖైదీల పెరోల్పై కమిటీలు : సుప్రీం
న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో ఖైదీలను పెరోల్పై విడుదల చేసే అంశంపై సుప్రీంకోర్టు స్పందించింది. జైళ్లలో ఖైదీల సంఖ్య ఎక్కువగా ఉండటంతో కరోనా వ్యాప్తికి అవకాశం ఉంది. పెరోల్పై విడుదల చేసే ఖైదీలను గుర్తించేందుకు, ఇతర మార్గదర్శకాల ఖరారుకు ఉన్నత స్థాయి కమిటీల ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువరించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా లు ఈ దిశలో చర్యలు తీసుకోవాలని పేర్కొంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు జైళ్లల్లోని ఖైదీల విషయంలో ఈ కమిటీలు నిర్ణయం తీసుకోవల్సి ఉంటుంది.
Supreme Court responded to release of prisoners on parole
- Advertisement -