Monday, April 29, 2024

సఖీ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: బాధిత మహిళలకు సాంత్వన కల్పించేందుకు వాన్ స్టాఫ్ సఖీసెంటర్ ద్వారా అందించే సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం రోజున పట్టణంలోని ధరూర్ క్యాంపు సమీపంలో నూతనంగా నిర్మించిన సఖీ కేంద్రం భవనాన్ని మంత్రి ప్రారంభోత్సవం చేశారు.

తొలుత పూజా కార్యక్రమాలు నిర్వహించి కేంద్రంలోని పలు గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మహిళల ప్రతీ సమస్య కౌన్సిలింగ్ ద్వారా పరిష్కారం చూపడానికి సఖి కేంద్రం ఉపయోగపడుతుందని అన్నారు. సఖీ కేంద్రం సేవల వివరాలను గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలియజేస్తూ విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు, గ్రామీణ ప్రాంత మహిళా ఉద్యోగులకు సఖీ కేంద్రం ద్వారా అందించే న్యాయ, వైద్య, కౌన్సిలింగ్ సేవల వివరాలను తెలియజేయాలని అన్నారు.

సామాజిక బాధ్యతతో సాటి మహిళలకు సహకారం అందించాలని సఖీ కేంద్రంలో పనిచేసే ఉద్యోగులను కోరారు. సఖీ కేంద్రానికి ప్రహారినిర్మించేందుకు నిధులు సమకూర్చుతామని, సెక్యూరిటి కల్పనకు ఎస్.పి. చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ సఖీ కేంద్రం ద్వారా అందించే సేవలను బాధిత మహిళలు సద్వినియోగపరుచుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జడీ చైర్‌పర్సన్ దావ వసంత, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, అదనపు కలెక్టర్ బి.ఎస్. లత, ఎస్పి భాస్కర్, గ్రంథాలయ చైర్మన్ చంద్ర శేఖర్ గౌడ్, ౄCMS చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, కౌన్సిలర్ శ్రీలత, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారి నరేష్, ఆర్ అండ్ బి ఈ ఈ శ్రీనివాస్, ప్రకృతి స్వచ్చంధ సంస్థ ప్రతినిధి జయ శ్రీ, సఖి కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది, అంగన్ వాడీలు, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News