Monday, April 29, 2024

పంజ్‌షేర్ తాలిబన్ల కైవసం ?

- Advertisement -
- Advertisement -
Taliban claim to have captured Panjshir
ఖండించిన ప్రతిఘటనశక్తులు

కాబూల్:  పంజ్‌షేర్ సహా ఇప్పుడు అఫ్ఘనిస్థాన్ అంతా తమ కైవసం అయిందని తాలిబన్లు శనివారం ఓ కీలక ప్రకటన వెలువరించారు. నలుమూలల నుంచి తాము సాగించిన ఉధృతపోరుతో పంజ్‌షేర్‌లోని ప్రతిఘటనకారులు వెనకకు వెళ్లారని, ఇప్పుడు ఇది తమ ఆధీనంలోకి వచ్చిందని తాలిబన్లు ప్రకటించారు. అయితే ఈ ప్రకటనను ఈ ప్రాంతపు ప్రతిఘటనకారులు ఖండించారు. అల్లాదయతో ఇప్పుడు పంజ్‌షేర్ కూడా తమ స్వాధీనంలోకి వచ్చినందున ఇక తమ తదుపరి ప్రక్రియ మరింత సజావుగా సాగుతుందని తాలిబన్ల కీలక కమాండర్ ఒకరు ప్రకటించారు. అక్కడ తమ తాలిబన్లు సంబరాలు చేసుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే ఇటువంటి తప్పుడు ప్రకటనలతో తమ స్వతంత్ర లోయను ఏ శక్తి దెబ్బతీయలేదని, తాలిబన్ల ప్రకటన మోసపూరితం అని లోయ నాయకుడు మసూద్ అహ్మద్ మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News