Monday, April 29, 2024

కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవం: గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవంపై నెలకొన్న వివాదంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర బిఆర్ అంబేడ్కర్ సచివాలయ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని గవర్నర్ గుర్తు చేశారు. కనీసం తనకు ఆహ్వాన పత్రిక కూడా పంపకుండా.. సిఎం కెసిఆర్ రాష్ట్ర నూతన సచివాలయ ప్రారంభోత్సవం చేశారన్నారు.

కొత్త పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతే ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని, రాష్ట్రపతికి రాజకీయాలతో సంబంధం లేదని ప్రతిపక్షాలు అంటున్నాయన్నారు. గవర్నర్లకు కూడా రాజకీయాలతో సంబంధం ఉండదు కాదా.. మరి, గవర్నర్ విషయంలో మాత్రం భిన్నమైన అభిప్రాయాలను ఎందుకు వ్యక్తం చేస్తున్నారని గవర్నర్ తమిళిసై ఈ సందర్భంగా ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News