- Advertisement -
హైదరాబాద్: భారత్కు చెందిన తరుణ్ కొనా జంటకు ఉగాండా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో రెండు టైటిల్స్ లభించాయి. తెలంగాణకు చెందిన తరుణ్ కొనా ఉగాండా బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో స్వర్ణాలు సాధించాడు. పురుషుల డబుల్స్ విభాగంలో తరుణ్శివం వర్మ జంట టైటిల్ను సొంతం చేసుకుంది. ఫైనల్లో తరుణ్ జోడీ 2115, 2220తో నైజీరియాకు చెందిన గొడ్విన్అనులా వొపు జంటను ఓడించి స్వర్ణం సాధించింది. ఇక, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత్కు చెందిన మేఘనా జక్కంపూడితో కలిసి బరిలోకి దిగిన తరుణ్ పసిడి పతకం దక్కించుకున్నాడు. భారత్కే చెందిన పూర్విషాశివం శర్మ జంటను ఓడించి తరుణ్ జోడీ మిక్స్డ్ టైటిల్ను దక్కించుకుంది.
Tarun in Uganda International Badminton Tournament
- Advertisement -