Monday, April 29, 2024

టీమిండియా నడ్డివిరిచిన ఎంగిడి… భారత్ 60/5

- Advertisement -
- Advertisement -

పెర్త్: టి20 ప్రపంచ కప్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 10 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 60 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఐదు వికెట్లు కోల్పోయి భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. రోహిత్ శర్మ(15), విరాట్ కోహ్లీ(07), కెఎల్ రాహుల్(09), హార్ధిక్ పాండ్యా(02) వికెట్లను తీసిన ఎంగిడి భారత జట్టు నడ్డి విరిచాడు. దీపక్ హుడా డకౌట్ రూపంలో మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో సూర్యాకుమార్ యాదవ్ (17), దినేష్ కార్తీక్(01) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News