Sunday, April 28, 2024

రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ రసవత్తరంగా మారింది. నాలుగో రోజు రెండో ఇన్నింగ్ లో టీమిండియా 14 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 48 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత్ ఇంకా 184 పరుగులు చేస్తే గెలిచే అవకాశం ఉంది. యశస్వి జైస్వాల్ 15 పరుగులు చేసి టామ్ హార్ట్ లే బౌలింగ్ లో ఓలీ పోప్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. శుభ్ మన్ గిల్ టామ్ హార్ట్ లే బౌలింగ్ లో ఓలీ పోప్ కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(26), కెఎల్ రాహుల్(04) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 246

భారత్ తొలి ఇన్నింగ్స్: 436

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 420

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News