Sunday, April 28, 2024

‘స్వచ్ఛ’లో హ్యాట్రిక్

- Advertisement -
- Advertisement -

Telangana first place in swachh bharat for 3rd time

 

 దేశంలో మరోసారి నెంబర్‌వన్‌గా
తెలంగాణ వరసగా ఇది మూడో
మొదటి బహుమతి జిల్లాల కేటగిరీలో
కరీంనగర్‌కు మూడో స్థానం సిఎం
కెసిఆర్ రూపొందించిన పట్టణ-పల్లె ప్రగతి,
మిషన్ భగీరథ కార్యక్రమాల ఫలితం
అవార్డులు సాధించినందుకు
ఆనందంగా ఉంది : మంత్రి ఎర్రబెల్లి

మనతెలంగాణ/హైదరాబాద్ : స్వచ్ఛభారత్‌లో తెలంగాణ మరోసారి స్వచ్ఛతను సాధించిన దేశంలో నెంబర్‌వన్‌గా నిలిచింది. వరసగా మూడోసారి స్వచ్ఛ భారత్ అవార్డులను దక్కించుకొని హ్యాట్రిక్ సాధించింది. వరసగా మూడేళ్లుగా మొదటి స్థానాన్ని దక్కించుకుంటోంది. జిల్లాల కేటగిరీలో కరీంనగర్ జిల్లా దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఇదంతా సిఎం కెసిఆర్ చేపట్టిన పట్టణ, -పల్లె ప్రగతి, మిషన్ భగీరథ కార్యక్రమాల ఫలితమని, దీనికి కారణమైన కెసిఆర్‌కు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అవార్డులు ప్రకటించిన కేంద్రానికి ధన్యవాదాలు తెలపడంతో పాటు అవార్డులు సాధించిన వాళ్లను మంత్రి అభినందించారు.

జిల్లాలు, బ్లాక్‌లు, గ్రామ పంచాయతీల వారీగా అవార్డుల ప్రదానం

ప్రతి ఏటా స్వచ్ఛ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, జిల్లాలు, బ్లాక్‌లు, గ్రామ పంచాయతీల వారీగా అవార్డులు అందచేస్తోంది. త్రాగునీరు, పారిశుద్ధ్య విభాగంలో గతేడాది మూడు ప్రచారాలను కేంద్రం ప్రారంభించింది. అందులో 2019, నవంబర్ 1 నుంచి 2020, ఏప్రిల్ 20 స్వచ్ఛ సుందర్ సముదాయిక్ షౌచాలయ (ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్) కార్యక్రమాన్ని, జూన్ 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు జిల్లాలు, గ్రామాలను సమీకరించి వారి కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణం-, నిర్వహణకు సముదాయిక్ షౌచలయ అభియాన్ (ఎస్‌ఎస్‌ఎ) కార్యక్రమాన్ని, 2020 ఆగస్టు 8 నుంచి ఆగస్టు 15 వరకు చెత్త, వ్యర్థాలను తొలగించేందుకు గందగీ ముక్త్ భారత్ (డిడిడబ్ల్యుఎస్ ) కార్యక్రమాన్ని వారం రోజుల పాటు నిర్వహించింది. ఈ మూడ కేటగిరీల్లోనూ అద్భుత ఫలితాలు సాధించిన తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్‌వన్‌గా నిలిచిందని కేంద్ర ప్రభుత్వ డిడిడబ్ల్యుఎస్ డైరెక్టర్ యుగల్ జోషి తెలిపారు. అలాగే జిల్లాల కేటగిరీలో మన రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాకు మూడో స్థానం దక్కింది. ఈ మేరకు యుగల్ జోషి, మన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు లేఖను పంపించారు.

అక్టోబర్ 2 వ తేదీన అవార్డుల అందజేత

కాగా, అక్టోబర్ 2 వ తేదీ, స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా ఈ అవార్డులను అందచేస్తారు. అయితే కరోనా సమయం కావడంతో జూమ్ ద్వారా, యూట్యూబ్ లైవ్ ద్వారా ఈ అవార్డులను కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వర్చువల్ పద్ధతిలో అవార్డులను అందచేస్తారు. మన రాష్ట్రం నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈ అవార్డును స్వీకరిస్తారు. కాగా, వరుసగా ఈ అవార్డులు రావడంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతోషం వ్యక్తం చేయడంతో పాటు సిఎం కెసిఆర్, కెటిఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, ఇతర అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులను మంత్రి అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News