Monday, April 29, 2024

39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు: మారెడ్డి

- Advertisement -
- Advertisement -

grain

హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటి వరకు 67 లక్షల 85 వేల మంది రేషన్ తీసుకున్నారని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మారెడ్డి మీడియాతో మాట్లాడారు. లబ్ధిదారులు 2 లక్షల 56 వేల మెట్రిక్ టన్నుల బియ్యం తీసుకున్నారన్నారు. 6301 కొనుగోలు కేంద్రాల్లో 39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. యాసంగిలో 58 శాతం ధాన్యం కొనుగోలు చేశామని, మహబూబ్‌నగర్, నల్లగొండలో 90 శాతం ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లోనే ధాన్యం కొనుగోలు డబ్బు జమ చేశామన్నారు. లాక్‌డౌన్‌లో కూడా 8 కోట్ల 14 లక్షల గన్నీ సంచులు సమకూర్చుకున్నామని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News