Saturday, April 27, 2024

బొత్స x తెలంగాణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర విద్యా విధానంపై ఏపీ విద్యాశాఖ మం త్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో చూచిరాతలు, కుంభకోణాలను ప్రతిరోజూ చూస్తూనే ఉన్నామని అన్నారు. విజయవాడలో గురువారం ట్రిపుల్ ఐటీ ప్రవేశాలను బొత్స ప్రకటించారు. ఈ నెల 20 నుంచి 25 వరకు ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు కౌన్సెలింగ్ జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యా విధానంపై ఆయన మాట్లాడుతూ ఏపీ వి ద్యా విధానాన్ని తెలంగాణతో పోల్చి చూడాల్సిన అవసరం కూడా లేదని అన్నారు.

ఉపాధ్యాయుల బదిలీలను కూడా సక్రమంగా చేసుకోలేని దుస్థితి లో తెలంగాణ ఉందని విమర్శించారు. మన వి ద్యా విధానం మనదని, మన ఆలోచనలు మనవని చెప్పారు. వలంటీర్లపై పవన్ చేసిన ఆరోపణల గు రించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా పొద్దు న్నే పవన్ గురించి మాట్లాడుకోవడం ఎందుకన్నా రు. పవన్ వ్యాఖ్యలను పట్టించుకోకుండా ఉంటేనే మంచిదని చెప్పారు. వలంటీర్ వ్యవస్థ ఎలా పు ట్టిందనే విషయాన్ని తొలుత పవన్ తెలుసుకోవాలని సూచించారు. వక్రబుద్ధితో వలంటీర్ వ్యవస్థ పై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

కించపరిస్తే సహించం : మంత్రి సబిత
తెలంగాణ విద్యావ్యవస్థ గురించి ఏపీ విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డా రు. రాష్ట్రాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే స హించబోమని హెచ్చరించారు. బొత్స చేసిన వ్యా ఖ్యలను ఉప సంహరించుకోవాలని ఆమె డిమాం డ్ చేశారు. ఏపిలో విద్యా వ్యవస్ధ బాగుంటే లక్షమంది విద్యార్థులు ఎందుకు తగ్గారని ఆమె ప్ర శ్నించారు. గురువారం కందుకూరు మండల కేం ద్రంలో మీడియాతో మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ రా ష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఏపి మాత్రం విరుద్దంగా మాట్లాడం శోచనీయమన్నారు.

సిఎం కెసిఆర్ రాష్ట్రంలో విద్యా వ్యవస్ధను మెరుగు పరుస్తున్నామని తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత 1050 గురుకులాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. తెలంగాణలో ఒక్కో విద్యార్థిపైన రూ. 1.50లక్షల ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు ఓఆర్‌సీసి కింద ప్రతి విద్యార్ధికి రూ.2.50లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. గడిచిన 9 ఏళ్లలో రెండుసార్లు ఉపాధ్యాయులను బదిలీలు గుర్తు చేశారు. కొంతమంది ఉపా ధ్యాయులు కోర్టుకు వెళ్లడంతో బదిలీలు ఆగాయని తెలిపారు.

బొత్సపై తెలంగాణ మంత్రులు విమర్శల దాడి
తెలంగాణ విద్యా వ్యవస్థలో చూచిరాతలు, కుంభకోణాలు రోజూ చూస్తున్నామంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బోత్సపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నువ్వా మాకు చెప్పేదంటూ కౌంటర్ ఇస్తున్నారు. బొత్స సత్యనారాయణ, ముందు నువ్వు తెలుసుకో.. నీ దగ్గర ఉన్న గురుకులాలు ఎన్ని మా దగ్గర ఎన్ని ఉన్నాయో చూడు. నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు నీ దగ్గర విద్యా వ్యవస్థ ఉందా నువ్వా మా విద్యార్థుల గురించి మాట్లాడేది అని మంత్రి గంగుల కమలాకర్ నిప్పులుచెరిగారు.

తెలంగాణపై ఇంకా కుట్రలేనా అంటూ విరుచుకుపడ్డారు. తాము ఏపీ జోలికి వెళ్లలేదని.. మాట్లాడుతున్నందుకు తాము ఏం చేశామనేది చెప్పుకొవాల్సి వస్తోందన్నారు. మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాజధాని ఎక్కడంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఏపీ ఉందని ఎద్దేవా చేశారు. వారికి తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. బొత్స ఎవరు? వోక్స్‌వ్యాగన్ కార్లను చూస్తే గుర్తొచ్చేది ఆయనే కదా. ఉమ్మడి ఏపీలో ఆయన ఎన్నో కుంభకోణాలు చేశారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్సీలో అంతులేని అవినీతికి పాల్పడ్డారని విరుచుకపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News