Sunday, April 28, 2024

మైసమ్మ ఆలయంలో చోరీ

- Advertisement -
- Advertisement -

Theft at Maisamma temple

 

మనతెలంగాణ, హైదరాబాద్ : మైసమ్మ ఆలయంలో చోరీ జరిగిన సంఘటన నగరంలోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. దొంగలు అమ్మవారి విగ్రహంపై ఉన్న 15తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ఆలయ పూజారి ఉదయం వెళ్లి చూసే సరికి చిందరవందరగా ఉండడంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూసే సరికి బంగారు ఆభరణాలు కన్పించలేదు. వెంటనే పూజారి సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఆలయంలో పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉన్న సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించనున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News