Saturday, April 27, 2024

చోరీ చేసిన దొంగ అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః విల్లాలో చోరీ చేసిన నిందితురాలిని బాచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి వద్ద నుంచి రూ.15లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ నిజాంపేట్ గ్రీన్ అవెన్యూ కాలనీలోని విల్లా నంబర్ 114లో వారం రోజుల క్రితం చోరీ జరిగింది. ఇంటి యజమాని తాళం వేసి ఊరికి వెళ్లి వచ్చే సరికి ఇంట్లోని రూ.15లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి.

కేసు నమోదు చేసుకున్న బాచుపల్లి పోలీసులు దర్యాప్తు చేసి కెపిహెచ్‌బికి చెందిన ఓ మహిళ చోరీ చేసినట్లు గుర్తించారు. సదరు మహిళా అదే విల్లాలో పనిచేస్తోంది. యజమాని ఊరికి వెళ్లిన విషయం గమనించి ఇంట్లోని బంగారు ఆభరణాలు చోరీ చేసింది. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బాచుపల్లి ఇన్స్‌స్పెక్టర్ సుమన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News