Saturday, April 27, 2024

లారీ బోల్తా: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: లారీ బోల్తాపడిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని కేసరపల్లి-సావరగూడెం చౌరస్తాలో బుధవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. చెన్నై-కోల్ కతా జాతీయ రహదారిపై బియ్యం లారీ బీహార్ నుంచి బెంగళూరు వెళ్తుండగా బోల్తాపడింది. లారీ పైభాగంలో దంపతులు తన కుమార్తెతో కలిసి కూర్చొవడంతోనే ముగ్గురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బస్తాల కింద ఉన్న మృతదేహాలను బయటకు తీశారు. మృతులు ఒడిశాకు చెందిన వారని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News