Monday, April 29, 2024

గుండెపోటుతో టోల్ ప్లాజా సిబ్బంది మృతి

- Advertisement -
- Advertisement -

పుల్లూరు: జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. విధుల్లో ఉండగా పంచలింగాల వాసి సమద్ మియా (58) ప్రాణాలు కోల్పోయాడు. పరిహారం చెల్లించాలని మృతుడి బంధువులు, టోల్ ప్లాజా సిబ్బంది ధర్నాకు దిగారు. టోల్ ప్లాజా సిబ్బంది మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని విధులు బహిష్కరించించారు. దీంతో వాహనదారులు వాహన రుసుము చెల్లించకుండా వెళ్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News