Sunday, April 28, 2024

కర్ణాటక ప్రభుత్వంతో టయోటా కిర్లోస్కర్ మోటర్ అవగాహన ఒప్పందం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: “మేక్ ఇన్ ఇండియా” నిబద్ధతకు కట్టుబడి, “అందరికీ మాస్ హ్యాపీనెస్” తీసుకురావాలనే లక్ష్యంతో, టయోటా కిర్లోస్కర్ మోటర్ (TKM) ఈ రోజు కర్ణాటక ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం (MOU) పై సంతకం చేసింది. తాజా పెట్టుబడుల ద్వారా దేశంలో ప్రస్తుత కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది.

దాదాపు రూ.3,300 కోట్ల పెట్టుబడులు ఈ ఎంఓయు లో భాగంగా పెట్టనున్నారు, ఈ కొత్త ప్లాంట్‌ ఏర్పాటుతో తమ సామర్థ్యాన్ని పెంచుకోవటంతో పాటుగా “అందరికీ మొబిలిటీ”ని సృష్టించడానికి కొత్త సాంకేతికతలను పరిచయం చేయడంతో స్థానిక ఉత్పాదక పర్యావరణ వ్యవస్థకు గణనీయమైన ప్రోత్సాహం లభిస్తుంది. ఇది భారతదేశంలోని కంపెనీ యొక్క మూడవ ప్లాంట్, ఇది కర్ణాటకలోని బెంగుళూరు సమీపంలోని బిదాడిలో ఉంది.

కర్ణాటక ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై ఈరోజు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మసకాజు యోషిమురా, మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టయోటా కిర్లోస్కర్ మోటార్ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో M. B. పాటిల్, కర్ణాటక ప్రభుత్వ, భారీ, మధ్య తరహా పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి మంత్రి, స్వప్నేష్ R. మారు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ & చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, విక్రమ్ గులాటి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సుదీప్ శాంత్రమ్ దాల్వి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ & చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్, టయోటా కిర్లోస్కర్ మోటర్ ఇతర టాప్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్నారు.

కొత్త పెట్టుబడుల రూపురేఖలు

పెట్టుబడి మొత్తం – INR 3,300 కోట్లు (సుమారుగా)
ప్లాంట్ ల వివరాలు – ప్లాంట్ 3
ప్రాంతం – బిదాడి
జోడించబడిన అదనపు ఉత్పత్తి – 1,00,000 యూనిట్లు
కొత్త ఉపాధి కల్పన – 2000 సంఖ్యలు (సుమారుగా)

ఈ పెట్టుబడి, 25 సంవత్సరాల చరిత్ర పై ఆధారపడి రాబోయే 25 సంవత్సరాల అభివృద్ధి దిశగా TKM యొక్క నిరంతర దీర్ఘకాలిక నిబద్ధతలో ఒక భాగం, ఇది “అమృత్ కాల్” (స్వర్ణయుగం) అనే ప్రధాన మంత్రి లక్ష్యంకు అనుగుణంగా “మేక్ ఇన్ ఇండియా”, “ఆత్మ నిర్భర్ భారత్” మిషన్‌ల వైపు కంపెనీ బలమైన సహకారాన్ని తెలియజేస్తుంది. కొత్త పెట్టుబడులు దాని సరఫరాదారుల సామర్థ్యం పెంచడం తో పాటుగా, మరింతగా ఉద్యోగ కల్పన, కర్ణాటక రాష్ట్రంలో స్థానిక సమాజ అభివృద్ధికి తోడ్పాటు అందించడం ద్వారా స్థానిక పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి ఊతాన్ని అందిస్తాయి.

“2017లో పూర్తిగా అంకితం చేసిన EV పాలసీని విడుదల చేయడంలో అగ్రగామిగా ఉన్న కర్ణాటక, 2021లో దానిని అప్‌డేట్ చేసింది, మొత్తం EV వాల్యూ చైన్‌లో రూ. 25,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంలో అగ్రగామిగా నిలిచింది. రాష్ట్రంలో రిజిస్టర్ చేయబడిన సుమారు 2 లక్షల EVలతో, మొబిలిటీ ల్యాండ్‌స్కేప్‌ను పునర్నిర్మించడంలో కర్ణాటక స్థిరంగా ముందుకు సాగుతుంది” అని, కర్ణాటక ప్రభుత్వ భారీ, మధ్య తరహా పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి మంత్రి M. B. పాటిల్ అన్నారు.

అంతేకాకుండా, బ్యాటరీ, సెల్ తయారీ, కాంపోనెంట్ ఉత్పత్తి, ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు, ఛార్జింగ్, మొత్తం విలువ గొలుసును విస్తరించడం మొదలు మౌలిక సదుపాయాలను పరీక్షించడం, పరిశోధన, అభివృద్ధి వరకూ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీకి కర్ణాటకను ప్రధాన గమ్యస్థానంగా ఉంచడానికి ప్రభుత్వం కొత్త క్లీన్ మొబిలిటీ పాలసీని తీసుకువస్తోంది. దీనితో, మొత్తం EV విలువ గొలుసులో రూ.50,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, సుమారు 100,000 కొత్త ఉద్యోగాలను సృష్టించడం, రాష్ట్రంలో సమగ్ర, సహాయక EV పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది” అని పాటిల్ తెలిపారు.

భారతదేశం వ్యూహాత్మక ప్రాముఖ్యతపై ఆసియా రీజియన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మసాహికో మీడా మాట్లాడుతూ.. “భారత మార్కెట్ ఎల్లప్పుడూ మాకు చాలా ముఖ్యమైనది. భారతదేశంలో కొత్త పెట్టుబడులతో, ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలను సుసంపన్నం చేసే స్థిరమైన మొబిలిటీ పరిష్కారాలను రూపొందించడం ద్వారా మరింత ఆశాజనకమైన భవిష్యత్తు కోసం మా ప్రపంచ దృష్టిలో TKM పాత్రను మరింత పెంచదలమని మేము విశ్వసిస్తున్నాము” అని అన్నారు.

ఈ సందర్భంగా టయోటా కిర్లోస్కర్ మోటర్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మసకాజు యోషిమురా మాట్లాడుతూ.. “భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న మొబిలిటీ కంపెనీగా, రాష్ట్ర ప్రభుత్వంతో ఈరోజు ముఖ్యమైన ఎంవోయూ కుదుర్చుకోవడం సంతోషంగా వుంది. ఈ కొత్త ప్లాంట్ కర్నాటక లో ఉపాధి కల్పన, అధునాతన క్లీన్ టెక్నాలజీల స్వీకరణ కు దోహదపడుతుంది. ఇంధన భద్రతను మెరుగుపరచడం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం & కార్బన్ న్యూట్రాలిటీని సాధించడంపై దృష్టి సారించడం ద్వారా భారతదేశానికి ఉత్తమ పరిష్కారాలను ప్రోత్సహించే ప్రపంచ స్థాయి స్థానిక పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి మేము ప్రభుత్వంతో కలిసి పని చేస్తూనే ఉంటాము” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News