- Advertisement -
ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఆంక్షలు విధించిన హైదరాబాద్ పోలీసులు
హైదరాబాద్: నగరానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రానున్న నేపథ్యంలో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నగరంలోని బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో రానున్నారు. అక్కడి నుంచి నేరుగా నానక్రాంగూడ, గచ్చిబౌలికి వెళ్లనున్నారు. పిఎన్టి ఫ్లైఓవర్, బేగంపేట ఫ్లైఓవర్, పంజాగుట్ట ఫ్లైఓవర్, కెబిఆర్ పార్క్ జంక్షన్, జుబ్లీహిల్స్ చెక్పోస్టు, రోడ్డునంబర్ 45 జంక్షన్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నుంచి నానక్రాంగూడకు వెళ్లనున్నారు. ఉపరాష్ట్రపతి వెళ్లనున్న మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు.
Traffic Restrictions in Hyderabad Tomorrow
- Advertisement -