Monday, April 29, 2024

సైబరాబాద్‌లో ఇన్స్‌స్పెక్టర్ల బదిలీ

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః సైబరాబాద్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న 14మంది ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. ఇందులో పలు పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు ఉన్నారు. చందానగర్, గచ్చిబౌలి, అల్వాల్, కెపిహెచ్‌బి, అమన్‌గల్, కొత్తూరు, సనత్‌నగర్, షాద్‌నగర్, నందిగామ ఎస్‌హెచ్‌ఓలను బదిలీ చేశారు.

కొత్తూరు ఎస్‌హెచ్‌ఓగా పనిచేస్తున్న బాలరాజును సనత్‌నగర్ ఎస్‌హెచ్‌ఓగా, షాద్‌నగర్ ఎస్‌హెచ్‌ఓగా ప్రతాప్‌లింగం, నందిగామ ఇన్స్‌స్పెక్టర్‌గా సురేష్, కెపిహెచ్‌బి ఇన్స్‌స్పెక్టర్‌గా వెంకటేష్, అల్వాల్ ఇన్స్‌స్పెక్టర్‌గా ఉపెందర్‌రావు, గచ్చిబౌలికి జేమ్స్‌బాబును, చందానగర్‌కు పాలవెల్లికి పోస్టింగ్ ఇచ్చి ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయిన వెంటనే వారి స్థానాల్లో చేరాలని ఆదేశించారు.

Also Read: క్యాబ్ డ్రైవర్‌పై మహిళ కాల్పులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News